Sunday, April 28, 2024

రైతులు దేశంలో అంతర్భాగం: విరాట్ కోహ్లీ

- Advertisement -
- Advertisement -

Virat kohli respond on Farmers strike

 

హైదరాబాద్: రైతు ఉద్యమంపై అంతర్జాతీయ ప్రముఖులు చేసిన ట్వీట్లపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు. భారత దేశంలో రైతులు అంతర్భాగమని, శాంతియుతంగా ఉండి ఇరువర్గాలు సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికి కలిసి మెలిసి ముందుకు సాగాలని సూచించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న ధర్నాపై అమెరికా పాప్ సింగర్ రిహానా, యువ పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్‌తో సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందించారు. వీళ్లు రైతులకు మద్దతు ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం వారిపై మండిపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News