Tuesday, May 7, 2024

ఢిల్లీ, మహారాష్ట్రలో పండించే పంట జెగ్గాసాగర్‌లో పండించిన రైతులు

- Advertisement -
- Advertisement -

మెట్‌పల్లి : ఢిల్లీ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పండించే పంటను మండలంలోని జెగ్గాసాగర్ గ్రామ రైతు మిట్టపల్లి రమేష్ రెడ్డి తన గ్రామంలో పండించారు. ఈ మేరకు మంగళవారం రోజున పట్టణంలోని శాస్త్రీ చౌరస్తాలో ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఇట్టి కర్భుజాల అమ్మకం జరిగిన కార్యక్రమాన్ని ఎంపిపి మారు సాయిరెడ్డి జెగ్గాసాగర్ సర్పంచ్ బద్దం సుగుణ రాజేష్‌లు ప్రారంభించారు. ఎంపిపి మారు సాయిరెడ్డి మాట్లాడుతూ ఈ స్వీట్ మిలన్ కర్భుజ విశాల్ ఆరోహి కర్భుజాలలో రకాలను మిట్టపల్లి రమేష్ రెడ్డి రైతు గత ఏడాది ఇక్కడ పండించి ఢిల్లీ మహరాష్ట్రకు ఎగుమతి చేశారని, అలాగే హైదరాబాద్ నగరాలలో ఉండే సూపర్ మార్కెట్ వారికి సరఫరా చేయడం జరిగిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News