Monday, May 6, 2024

మంత్రి కెటిఆర్‌కు వివేకానంద్ వినతి

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులపై మంగళవా రం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ హైదరాబాద్‌లోని వారి కార్యాలయం వద్ద మర్యాదపూర్వకం గా కలిశారు. ఈ సందర్భంగా దూలపల్లి బ్రిడ్జి, ఫాక్స్ సాగర్ నాలా, కోల్ నాలా, హెచ్. ఎం. డబ్ల్యు. ఎస్.ఎస్.బీ అభివృద్ధి పనులు, లింకు రోడ్లు, కుత్బుల్లాపూర్ జిహెచ్‌ఎంసిలోని ఎనిమిది డివిజన్‌లలో రోడ్లు, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్.ఎన్.డి.పి తదితర అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్‌తో ఎమ్మెల్యే చర్చించి, ఆయా పనులు సకాలంలో పూర్తి చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని మంత్రిని ఎమ్మెల్యే కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్ ఆ యా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News