Monday, May 13, 2024

పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు నమోదుకు…

- Advertisement -
- Advertisement -

ఈ నెల 26, 27వ తేదీలు

సెప్టెంబర్ 2, 3వ తేదీల్లో ప్రత్యేక శిబిరాలు

మనతెలంగాణ/ హైదరాబాద్ : శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాలలో ఈ నెల 26, 27వ తేదీలతో పాటు సెప్టెంబర్ 2, 3వ తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదుతో పాటు తప్పుల సరిచేసుకునేందుకు శిబిరాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. అక్టోబరు 4న తుది జాబితాను విడుదల చేయనున్న దృష్టా.. ఓటరు జాబితాలో.. సందేహాల నివృత్తికి, ఓటరు అభ్యంతరాలు సేకరణ, తప్పుల సవరణకు ఈ తేదీల్లో సంప్రదించవచ్చునని తెలిపారు. అక్టోబర్ ఒకటో తేదీకి 18 సంవత్సరాలు నిండే యువత తమ పేర్లను ఓటర్‌గా నమోదు చేసుకునేందుకు ఫారం 6తో దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News