Sunday, April 28, 2024

ఉగ్రవాదులను అంతమొందిస్తాం : లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా

- Advertisement -
- Advertisement -

We Will Hunt Down Terrorists Says Manoj Sinha

శ్రీనగర్ : ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందిన అమరపౌరుల ప్రతి నెత్తురు బొట్టు ఉగ్రవాదులను వారి సానుభూతిపరులను అంతమొందిస్తుందని జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా ఆదివారం ప్రమాణం చేశారు. జమ్ము కశ్మీర్ లోని శాంతి, సామాజిక ఆర్థిక పురోగతిని భగ్నం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, కానీ వ్యక్తిగత పురోగతి, కేంద్ర పాలిత ప్రాంత అభివృద్ది వేగంగా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. అమరులైన పౌరులకు తాను హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబాలకు సంతాపం తెలియచేస్తున్నానని చెప్పారు. అవామ్ కీ అవాజ్ నెలవారీ రేడియో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత పది రోజుల్లో లోయలో పౌరులు, మైనార్టీలు, స్థానికేతరులైన కార్మికులు ఉగ్రవాదుల దాడులకు బలయ్యారని, చెప్పారు. ఉగ్రవాదులను అంతమొందించడానికి భద్రతా దళాలు కర్తవ్యబద్ధులై ఉన్నారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News