Saturday, May 11, 2024

 తెలంగాణలో వెల్‌స్పన్ కు రెండు ప్రత్యేక అవార్డులతో గుర్తింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలోని ప్రముఖ బహుళ జాతి సంస్ధలలో ఒకటైన వెల్‌స్పన్, తమ అత్యుత్తమ సహకారం కోసం ప్రతిష్టాత్మక గుర్తింపును అందుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒక దశాబ్దం పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని జరుపుకుంటున్న మహోన్నత వేడుకల్లో భాగంగా జూన్ 6, 2023న జరిగిన తెలంగాణ పారిశ్రామిక వృద్ధి ఉత్సవంలో ఈ అవార్డులు అందజేయబడ్డాయి.

ఈ కార్యక్రమంలో, తెలంగాణలో టెక్స్‌టైల్ పరిశ్రమ అభివృద్ధికి వెల్‌స్పన్ అందిస్తున్న సహకారం, ఈ కారణం పట్ల వెల్‌స్పన్ కు ఉన్న తిరుగులేని నిబద్ధతను గుర్తించి గౌరవనీయమైన అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డును శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి, తెలంగాణ ప్రభుత్వం; Dr. S. హరీష్, I.A.S., కలెక్టర్ – రంగా రెడ్డి జిల్లా; శ్రీమతి తీగల అనితారెడ్డి, ZP చైర్‌పర్సన్ – రంగారెడ్డి జిల్లా; మరియు శ్రీ రాజేశ్వర్ రెడ్డి, జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ సహా గౌరవనీయ అతిథులు వెల్‌స్పన్ కు అందించారు.

అంతేకాకుండా, వెల్‌స్పన్ యొక్క ఆకట్టుకునే సహకారానికి గుర్తింపుగా, తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో వెల్‌స్పన్ కు మరో ప్రతిష్టాత్మక అవార్డును కూడా అందించారు. ఇది తెలంగాణలో టెక్స్‌టైల్ పరిశ్రమ వృద్ధి మరియు అభివృద్ధిని ప్రోత్సహించడంలో వెల్‌స్పన్ యొక్క అత్యుత్తమ పాత్రను మరింతగా ప్రదర్శిస్తుంది. ఈ రెండవ పురస్కారాన్ని శ్రీ కె.టి. రామారావు, పరిశ్రమలు, IT E&C, మరియు MA & UD, తెలంగాణ ప్రభుత్వం ; శ్రీ జయేష్ రంజన్, I.A.S., ప్రిన్సిపల్ సెక్రటరీ, పరిశ్రమలు & వాణిజ్యం, IT – E&C, తెలంగాణ ప్రభుత్వం; శ్రీ బుధ ప్రకాష్ జ్యోతి, IAS, సెక్రటరీ, హ్యాండ్లూమ్స్ & టెక్స్‌టైల్స్, తెలంగాణ ప్రభుత్వం, మరియు శ్రీ వి . మధుసూదన్, TSIIC CEO అందజేశారు.

ఫ్లోరింగ్ మరియు అధునాతన టెక్స్‌టైల్స్ కోసం ఇటీవలి రూ. 2000 కోట్ల వెల్‌స్పన్ యొక్క పెట్టుబడి, తెలంగాణలో తాము కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతాల ఆర్థిక శ్రేయస్సుపై రూపాంతర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ పెట్టుబడి అనేక ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా ఈ ప్రాంతం యొక్క సామాజిక-ఆర్థిక వృద్ధికి సైతం దోహద పడుతుంది. స్థానిక కమ్యూనిటీలకు మరియు కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యకలాపాలకు ఈ నిబద్ధత 2006లో అంజార్‌లో వెల్‌స్పన్ యొక్క విజయవంతమైన ప్రయత్నాన్ని ప్రతిధ్వనిస్తుంది, ఇక్కడ పాక్షిక-శుష్క ప్రాంతం అభివృద్ధి చెందుతున్న కమ్యూనిటీగా పునరుజ్జీవింపబడింది.

ఈ గుర్తింపుపై వెల్‌స్పన్ ప్రతినిధి మాట్లాడుతూ.. “తెలంగాణలో వస్త్ర పరిశ్రమ వృద్ధి పట్ల తమ అచంచలమైన అంకితభావానికి నిదర్శనంగా నిలిచే ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకోవడం ఒక గౌరవం గా భావిస్తున్నాము. వెల్‌స్పన్ తమ వనరులను మరియు నైపుణ్యాన్ని మెరుగ్గా ఉపయోగించుకోవడానికి కట్టుబడి ఉంది. చుట్టుపక్కల ఉన్న సమాజాలను ఉద్ధరించడం తో పాటుగా రాష్ట్ర సమగ్ర పురోగతికి సైతం తోడ్పడుతుంది” అని అన్నారు

వెల్‌స్పన్ తమ ఉద్యోగులు మరియు కమ్యూనిటీల శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తూ టెక్స్‌టైల్ పరిశ్రమలో ఆవిష్కరణలు మరియు పర్యావరణ అనుకూల ప్రక్రియలను కొనసాగిస్తూనే ఉంది. తెలంగాణాలో కంపెనీ సాధించిన విజయాలు స్ఫూర్తిగా నిలుస్తాయి. భారతీయ పరిశ్రమల రంగంలో అగ్రగామిగా దాని స్థానాన్ని బలోపేతం చేస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News