Saturday, May 4, 2024

తెలంగాణ ఉద్యమంలో బిజెపి పాత్ర ఏమిటో చెప్పాలి

- Advertisement -
- Advertisement -
అద్వానీలాంటి అగ్రనాయకుని అణగదొక్కిన చరిత్ర మోడీకే సొంతం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్: ఎన్నికల ముందు విభజన హామీలు నెరవేరుస్తారని ప్రజలంతా ఆశించారని, ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై విషం కక్కారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. శనివార బీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అసలు బీజేపీ పాత్ర ఏమిటని విశ్వాస ఘాతకుడు మోదీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్వానీలాంటి నాయకున్ని అణగదొక్కిన చరిత్ర మోదీకి ఉందని, కోచ్ ఫ్యాక్టరీ పెట్టకుండా ఓ చిన్న రిపేర్ కంపెనీ పెట్టారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు నమ్మకద్రోహం చేశారని, ఏపీలో ఏడు మండలాలు కలిపి తెలంగాణకు మోసం చేశారని మండిపడ్డారు. దేశానికి కరువొచ్చినా దేశానికి అన్నం పెట్టగలిగే స్థాయిలో తెలంగాణ ఉందన్నారు. పేర్లు మార్చి పెట్టుకున్న పథకాలు అన్నింటికీ తెలంగాణే కేంద్ర బిందువన్నారు. కర్ణాటకలో అత్యంత అవినీతి చేసిందని బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. దేశంలో 80 కోట్ల బీసీలు మోదీ ప్రధాని అయితే సంతోషపడ్డారని, కానీ బీసీ మంత్రిత్వ శాఖ లేని ప్రభుత్వం మోదీదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి జరిగి ఉంటే ఇన్ని అద్భుత పథకాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News