Saturday, April 27, 2024

నగరంలో భార్య చేతిలో భర్త హతం

- Advertisement -
- Advertisement -

Wife killed husband at Rajendra Nagar PS Limits

హైదరాబాద్: భార్య చేతిలో భర్త హతమైన సంఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆర్మీలో రిటైర్మెంట్ పొందిన విశాల్ దివాన్ ను భార్య సబీనా రోషం శనివారం అర్ధరాత్రి కత్తితో పొడిచి హత్యచేసింది. పోలీసులు కథనం ప్రకారం.. సన్ సిటీ మాఫెల్ టౌన్ షిప్ లో విశాల్ దివాన్, సబీనా రోషం జీవనం గడుపుతున్నారు. గత కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో వారు దూరంగా ఉంటున్నారు. ఇటీవల వారిద్దరు మళ్లీ కలిసి నివాసముంటున్నారు. గతంలో ఉన్న కుటుంబకలహాల నెపంతో భార్య సబీనా విశాల్ పై కత్తితో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిని ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. తర్వాత నిందితురాలిని అరెస్టు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Wife killed husband at Rajendra Nagar PS Limits

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News