Friday, April 26, 2024

వనస్థలిపురంలో దారుణం

- Advertisement -
- Advertisement -

wife murders husband in Vanasthalipuram

హైదరాబాద్: ఓ భార్య తన భర్తను చంపి ఇంట్లోనే పాతిపెట్టిన దారుణ సంఘటన నగరంలోని వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. మృతుడు గగన్ అగర్వాల్ గత నెల 8 తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని భార్యను విచారించడంతో హత్య ఉదంతం బయటపడింది. గతేడాది నౌసిన్ బేగంతో అగర్వాల్ విహహం జరిగింది. గగన్ అగర్వాల్, నౌసిన్ బేగం మధ్య గొడవల వల్లే ఈ హత్య జరిగినట్టు పోలీసులు తెలిపారు. దీంతో నౌసిన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

wife murders husband in Vanasthalipuram

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News