- Advertisement -
మాజీ సిఎం అమరీందర్ జోస్యం
చండీగఢ్: బిజెపి, అకాలీ చీలిక వర్గంతోకలసి తన పార్టీ పంజాబ్లో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సోమవారం జోస్యం చెప్పారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్తో సోమవారం నాడిక్కడ సమావేశమైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ మధ్య ఎటువంటి రాజకీయ చర్చలు జరగలేదని, మర్యాదపూర్వకంగానే తాను ఖట్టార్ను కలుసుకున్నానని అమరీందర్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంజాబ్ లోక్ కాంగ్రెస్లో పెద్ద నాయకులెవరైనా చేరే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు సమయం కోసం వేచి చూడండి అని ఆయన జవాబిచ్చారు. అన్నీ సజావుగా సాగుతున్నాయని, తమ పార్టీ సభ్యత్వ నమోదుకు పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తోందని ఆయన చెప్పారు.
- Advertisement -