ఆక్లాండ్: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సాధించిన విజయం చారిత్రాత్మకమైందని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ అసాధారణ పోరాట పటిమతో చివరి టెస్టులో సాధించిన విజయం ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమైందన్నాడు. సీనియర్ క్రికెటర్లూ లేకున్నా యువ ఆటగాళ్లు అసాధారణ రీతిలో పోరాడడం క్రికెట్కు శుభసూచకనమన్నాడు. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును వారి సొంత గడ్డపై ఓడించడం ఏ జట్టుకైనా చాలా కష్టంతో కూడుకున్న విషయమన్నాడు. అయితే, యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు దీన్ని ఆచరణలో చేసి చూపిందన్నాడు. చిరస్మరణీయ విజయం సాధించిన టీమిండియా ఆటగాళ్లను ఎంత పొగిడినా తక్కువేనని పేర్కొన్నాడు. ఈ విజయం భారత్ క్రికెట్ చరిత్రలోనే అరుదైన మైలురాయిగా మిగిలిపోవడం ఖాయమని విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు.
Williamson praises Team India Remarkable Victory