Saturday, April 27, 2024

భారతీయులే నిర్ణయం తీసుకోవాలి: సచిన్

- Advertisement -
- Advertisement -

ముంబై : రైతుల ఉద్యమం నేపథ్యం, పలువురు సెలెబ్రిటీలు ఉద్యమానికి మద్దతు పలుకుతూ ట్వీట్లు వెలువస్తున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మనమంతా ఓ దేశంగా సమైక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. భారత దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలుగకూడదని హెచ్చరించారు. బాహ్య శక్తులు కేవలం ప్రేక్షకులుగానే ఉండాలని, మన దేశ వ్యవహారాల్లో భాగస్వాములు కారాదని స్పష్టం చేశారు. భారత దేశం గురించి భారతీయులకు తెలుసునని, భారత దేశం కోసం ఏ నిర్ణయమైనా భారతీయులే తీసుకోవాలని పేర్కొన్నారు.

Sachin Tendulkar reacts on farmers protest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News