Wednesday, May 29, 2024

కదులుతున్న బస్సులో మహిళపై డ్రైవర్, కండక్టర్ అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

 

Woman gang-raped on moving bus at meerut

ఢిల్లీ: రాత్రంతా కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం చేసి రోడ్డుపై పడేసిన సంఘటన మీరట్‌లోని ఢిల్లీ రోడ్డులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శుక్రవారం రాత్రి బైశాలి బస్టాండ్‌లో ఓ మహిళ ప్రయాణికురాలు మీరట్ కు వెళ్లే బస్సు ఎక్కింది. బస్సులో మహిళ శీతల పానీయం తాగగానే అపస్మారక స్థితిలోకి పోయింది. వెంటనే కదులుతున్న బస్సులో డ్రైవర్, కండక్టర్ ఆమెపై సామూహిక అత్యాచారం చేసి రోడ్డుపై పడేశారు. స్పృహ లేకుండా తీవ్ర గాయాలతో ఉన్న మహిళను వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సదరు మహిళను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు మీరట్‌లోని సర్ధానా ప్రాంతంలో నివసిస్తున్నట్టు గుర్తించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని మీరట్ ఎస్‌పి అజయ్ సాహ్ని తెలిపాడు. నిందితులను అతి త్వరలో అరెస్టు చేస్తామన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News