హైదరాబాద్: ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ.20,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని మెట్టుగూడకు చెందిన పోలపల్లి శివకుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. దడ్డోజువల నవీన్కుమార్ మెడికల్ వ్యాపారం చేస్తున్నాడు. శివకుమార్కు ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహించడం అలవాటు ఉంది. ఆర్గనైజర్గా వ్యవహరిస్తే ఎక్కువగా డబ్బులు వస్తాయని చెప్పి నవీన్తో కలిసి ప్లాన్ వేశాడు.
రాజస్థాన్కు చెందిన కెడి ఆన్లైన్లో బూకీని సంప్రదించారు. వారి సూచనలతో www.deltaexch.in ద్వారా లాగిన్ అయి యూజర్ ఐడి, పాస్వర్డ్ను బెట్టింగ్ కట్టేవారికి ఇస్తున్నారు. దీని ద్వారా బాల్ టు బాల్కు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎంల ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. ఐపిఎల్ మ్యాచ్ల్లో బెట్టి కడుతున్న వారి వద్ద నుంచి నవీన్కుమార్ డబ్బులు వసూలు చేస్తున్నాడు. అలంతేకాకుండా నగరంలోని 15 నుంచి 20మంది పంటర్లను నియమించుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. విషయం పోలీసులకు తెలియడంతో నిందితులను పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం చిలకలగూడ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. టాస్క్ఫోర్స్ ఇన్స్స్పెక్టర్ నాగేశ్వర్ రావు, ఎస్సై పరమేశ్వర్ తదితరులు పట్టుకున్నారు.