- Advertisement -
రాంచీః జార్ఖండ్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది.ఓ మహిళపై 17మంది గ్యాంగ్ రేప్కు పాల్పపడిన ఘటన జార్ఖండ్లోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు గత మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో తన భర్తతో కలిసి మార్కెట్కు వెళ్లి తిరిగి వస్తుండగా..మద్యం మత్తులో ఉన్న 17మంది వారిని దారిలో అడ్డగించి దాడి చేశారు. భర్తను కొట్టి, బాదితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలు భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణానికి ఓడిగట్టిన నిందితుల్లో ఒకరిని పట్టుకున్న పోలీసులు మిగతా వారికోసం గాలిస్తున్నారు.
Woman gangraped by 17 drunk men in Jharkhand
- Advertisement -