- Advertisement -
మహిళా నక్సలైట్ మృతి, ఎకె47 స్వాధీనం
రాయ్పూర్: చత్తీస్గఢ్లో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా నక్సలైట్ మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఒక ఎకె47, రెండు తుపాకులు, పెద్దమొత్తంలో మావోయిస్ట్ ప్రచార సామగ్రిని జప్తు చేశామని బస్తర్ రేంజ్ ఐజి పి.సుందర్రాజు తెలిపారు. బస్తర్ జిల్లాలోని అడవుల్లో మావోయిస్టుల దర్భా డివిజన్ సభ్యులు సమావేశమయ్యారని తెలిసి భద్రతా దళాలు అక్కడికి చేరుకోగా ఈ ఎదురు కాల్పుల ఘటన జరిగిందని ఆయన తెలిపారు. ఉదయం 8 గంటలకు ఈ ఎన్కౌంటర్ జరిగిందని, కాల్పులు ఆగిపోయిన తర్వాత భద్రతా దళాలు ఆ ప్రాంతంలో వెతుకుతుండగా ఓ మహిళా నక్సలైట్ మృతదేహం కనిపించిందని ఆయన తెలిపారు. మృతురాలు ఎవరన్నది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
- Advertisement -