Friday, May 3, 2024

World Cup 2023: మూడు వికెట్లు కోల్పోయిన ఆప్గాన్..

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఐసిసి వన్డే ప్రపంచకప్ 2023 లీగ్ దశలో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆఫ్గాన్ కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 32 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్ లో ఓపెనర్ ఇబ్రహీం జార్డన్(22) ఔటయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ రెహ్మనుల్లా(28)ను హార్దిక్ పాండ్యా పెవిలియన్ పంపాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన రహ్మత్ షా()ను శార్థుల్ ఠాకూర్ ఔట్ చేశాడు. దీంతో ఆఫ్గాన్ 63 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆఫ్గాన్ జట్టు 28 ఓవర్లలో 133 పరుగులు చేసింది. క్రీజులో హష్మతుల్లా షాహిది(29), అజ్మతుల్లా(40)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News