Saturday, May 4, 2024

WTC ఫైనల్: ఐదోరోజు ప్రారంభమైన ఆట..

- Advertisement -
- Advertisement -

WTC Final: 5th day play starts after rain delay

సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఐదోరోజు గంట ఆలస్యంగా మ్యాచ్‌ ప్రారంభమైంది. నిన్న(సోమవారం) వర్షం కారణంగా ఆట పూర్తిగా రద్దైంది.మొదటి రోజు కూడా వర్షంతో ఆట పూర్తిగా రద్దైన విషయం తెలిసిందే. ఇక, ఐదో రోజు, రిజర్వ్ డే తోపాటు రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఫైనల్ లో ఫలితం తేలుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం సౌతాంప్టన్‌లో ఆకాశం ప్రకాశవంతంగా ఉండటంతో అంపైర్లు మ్యాచ్‌ను ప్రారంభించారు. వరుణుడి అంతరాయం కారణంగా ఐదో రోజు ఆటలో 7 ఓవర్లు కోత విధించారు. కాగా, న్యూజిలాండ్‌ తమ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లకు 101/2తో కొనసాగుతోంది. ప్రస్తుతం కేన్‌ విలియమ్సన్(12)‌, రాస్‌ టేలర్‌(0) క్రీజులో ఉన్నారు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

WTC Final: 5th day play starts after rain delay

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News