Friday, May 10, 2024

WTC ఫైనల్: కోహ్లీ, పంత్ ఔట్..

- Advertisement -
- Advertisement -

సౌథాంప్టన్: ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌ లో తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 146/3 స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే టీమిండియా షాక్ తగిలింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(44), జెమిసన్ బౌలింగ్ లో ఎల్బిగా ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో స్వల్ప వ్వవధిలో రెండు కీలక వికెట్లను భారత్ కోల్పోయింది.దీంతో భారత్ ఒత్తడిలో పడింది. ప్రస్తుతం భారత్ 77 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. క్రీజులో అజింక్యా రహానె(42), రవింద్ర జడేజా(6)లు ఉన్నారు.

WTC Final: India lost 5 wickets against NZ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News