Friday, May 10, 2024

WTC ఫైనల్: స్వల్ప వ్యవధిలో 3వికెట్లు కోల్పోయి కివీస్..

- Advertisement -
- Advertisement -

సౌథాంప్టన్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో ఐదోరోజు 101/2 స్కోరుతో ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ స్వల్ప వ్యవధిలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. కివీస్ బ్యాట్స్ మెన్లు రాస్ టేలర్(11), వాట్లింగ్(1)లను మహ్మద్ షమీ పెవిలియన్ పంపగా, హెన్రీ నికోలస్(7)ను ఇశాంత్ శర్మ ఔట్ చేశాడు. దీంతో 134 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ ఒత్తిడిలో పడింది. లంచ్ సమయానికి కివీస్ 72 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ కేన్ విలియమ్సన్(19), గ్రాండ్ హోమ్(0)లు క్రీజులో ఉన్నారు.

WTC Final: New Zealand 135/5 at Lunch on day 5

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News