Thursday, May 9, 2024

దేశంలో ఆలయాలకు యాదాద్రి ఆదర్శం: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Yadadri temple ideal for temples

యాద్రాద్రి: దేశంలో ఆలయాలకు ఆదర్శంగా యాదాద్రి ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు 90 శాతానికి పైన పూర్తి కావడం పట్ల సిఎం కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. శివాలయం, పుష్కరిణీ స్నాన ఘట్టాలు పూర్తి కావొచ్చయన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులు వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి వచ్చిన అనుభూతి కలిగేలా యాదాద్రి నిర్మాణాలకు తుది మెరుగులు దిద్దాలని అధికారులకు కెసిఆర్ సూచించారు. మూల విరాట్ స్వామి సేవలు దూరం నుంచి కూర్చొని చూసినా కనిపించేలా ఉండాలన్నారు. విద్యుద్దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగేవిధంగా విద్యుదీకరణ పనులను తీర్చిదిద్దాలని కోరారు. అద్దాల మండపాన్ని సిఎం కెసిఆర్ పరిశీలించడంతో పాటు రెయిలింగ్ పనులపట్ల కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. లిప్టు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఆలయం చుట్టూ నిర్మితమవుతున్న రహదారి వలయం, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాన్ని కలియ తిరుగుతూ పరిశీలించారు. పుష్కరిణీ పనులు, భక్తుల సౌకర్యార్థం మెట్లదారి పూర్తి చేయాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News