Saturday, May 4, 2024

యువతిని కత్తితో పొడిచి…యువకుడిని చంపిన స్థానికులు

- Advertisement -
- Advertisement -

Young man stab women with knife

అమరావతి: ప్రేమించడం లేదని యువతిని యువకుడు కత్తితో పొడిచిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా సాంబయ్య కండ్రిగలో జరిగింది. అనంతరం గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన యువకుడిని స్థానికులు రాళ్లతో కొట్టి చంపారు. ఓ యువకుడు కండ్రిగా గ్రామానికి చెందిన యువతి వెంట పడుతున్నాడు. ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని యువతి వెంట పడుతున్నాడు. అతడి వేధింపులు ఎక్కువ కావడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. యువతి ఇంటికి వెళ్తుండగా మార్గం మధ్యలో కత్తితో పొడిచాడు. అనంతరం అతడు గొంతు కోసుకొని కిందపడిపోయాడు. స్థానికులు సదరు యువకుడిని రాళ్లతో కొట్టి చంపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఈ దారుణం జరిగిందని యువతి బంధువులు, గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News