Wednesday, May 1, 2024

మద్యం మత్తులో అన్నను హత్య చేసిన తమ్ముడు

- Advertisement -
- Advertisement -

Younger Brother Killed His Elder Brother in Shaikpet

హైదరాబాద్: మద్యం మత్తులో అన్నను తమ్ముడు హత్య చేసిన సంఘటన నగరంలోని షేక్‌పేటలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. షేక్‌పేటకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు విజయ్, చిన్నా అలియాస్ నరేందర్ మధ్య ఇంటి విషయంపై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరు మంగళవారం రాత్రి మద్యం తాగారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆవేశంతో తమ్ముడు నరేందర్, అన్న విజయ్‌ను కర్రతో కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న గోల్కొండ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గోల్కొండ ఇన్స్‌స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News