- Advertisement -
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నేత దిలీప్ గాంధీ (69) కరోనాతో బుధవారం మృతి చెందారు. కరోనా నిర్థారణ కావడంతో మంగళవారం ఆయన ఢిల్లీ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. వాజ్పాయ్ ప్రభుత్వంలో దిలీప్ గాంధీ కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1980 లో కార్పొరేటర్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన దిలీప్ 1999 నుంచి మహారాష్ట్ర అహ్మద్నగర్ నుంచి మూడు సార్లు ఎంపిగా ఎన్నికయ్యారు. 2019 సాధారణ ఎన్నికల్లో ఆయనకు పోటీ చేయడానికి పార్టీ నుంచి టికెట్ రాలేదు.
BJP leader Dilip Gandhi dies with Corona
- Advertisement -