Sunday, May 5, 2024

హుజురాబాద్ ఉపఎన్నిక: మూడో రౌండ్ లోనూ బిజెపి ఆధిక్యం..

- Advertisement -
- Advertisement -

BJP Leads in 3rd round in Huzurabad by poll

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తైంది. ఇందులోనూ బిజెపి ఆధిక్యంలో నిలిచింది. మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి బిజెపి 911 ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉంది. ఈ రౌండ్ లో బిజెపికి 4,064 ఓట్లు, టిఆర్ఎస్ కు 3,159 ఓట్లు, కాంగ్రెస్ కు 107 ఓట్లు వచ్చాయి. దీంతో మూడు రౌండ్లతో కలిపి బిజెపికి 13,525 ఓట్లు, టిఆర్ఎస్ కు 12,252 ఓట్లు, కాంగ్రెస్ కు 446 ఓట్లు వచ్చాయి. దీంతో మూడు రౌండ్ల తర్వాత బిజెపి 1273 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతోంది.

కాగా, ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లు, 14 టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 22 రౌండ్ల‌లో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ముగియ‌నుంది. సాయంత్రం వరకు పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి.

BJP Leads in 3rd round in Huzurabad by poll

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News