- Advertisement -
కోల్కతా: పశ్చిమబెంగాల్లోని మూడు జిల్లాల్లో పిడుగుపాటుకు 11 మంది చనిపోయారు. బంకురా, పూర్బ బర్ధమాన్, హౌరా జిల్లాల్లో పిడుగులు పడ్డాయి. పొలంలో పనిచేస్తుండగా బంకురా జిల్లాలో ఐదుగురు, పూర్బ బర్ధమాన్ జిల్లాలో 5గురు, హౌరాలో ఒకరు మరణించారు. వేర్వేరు గ్రామాల్లో పిడుగు పాటుకు పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. దక్షిణ పశ్చిమబెంగాల్ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
11 died in lightning strikes in West Bengal
- Advertisement -