Friday, April 26, 2024

రాష్ట్రంలో కొత్తగా 122 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

122 new covid cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 25,849 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 122 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆదివారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,72,489కు పెరిగింది. తాజాగా 171 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 6,64,759 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,966కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.85 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,764 యాక్టివ్ కేసులున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News