Wednesday, May 15, 2024

దేశంలో మరో 13,083 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

13083 new covid-19 cases reported in india

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలో కొత్తగా 13,083 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో మరో 14,808 కోలుకున్నారు. ఈ మహమ్మారి బారినపడి 137 మరణించారు. భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,33,131కి పెరిగింది. దేశవ్యాప్తంగా 1,04,09,160 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇండియాలో కరోనా మరణాల సంఖ్య 1,54,147గా నమోదైంది. ప్రస్తుతం దేశంలో 1,69,824 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. జనవరి 29 వరకు మొత్తం 19,58,37,408 మంది నమూనాలను పరీక్షించారు. వీటిలో నిన్న 7,56,329 నమూనాలను పరీక్షించినట్టు ఐసిఎంఆర్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News