- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,23,005మందికి పరీక్ష చేయగా..కొత్తగా 1,362 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 24మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 6,12,196కు చేరుకుంది.ఇప్పటివరకు రాష్ట్రంలో 3,556మంది బాధితులు కరోనాతో మరణించారు. గత 24 గంటల్లో కరోనా వైరస్ నుంచి 1,813మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,565 కరోనా యాక్టీవ్ కేసులున్నాయి.
1362 New Corona Cases Reported in Telangana
- Advertisement -