Saturday, April 27, 2024

బిజెపి యుపి ఉపాధ్యక్షుడిగా మాజీ ఐఎఎస్ ఎకె శర్మ

- Advertisement -
- Advertisement -

Former IAS AK Sharma as BJP UP vice-president

 

న్యూఢిల్లీ: మాజీ ఐఎఎస్ అధికారి అరవింద్‌కుమార్‌శర్మను బిజెపి ఉత్తర్‌ప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ ఏడాది జనవరిలోనే శర్మ బిజెపిలో చేరారు. 2022 ప్రారంభంలో యుపి అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యత కలిగి ఉన్నది. యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ తన మంత్రివర్గంలో శర్మకు చోటు కల్పిస్తారన్న వార్తల నేపథ్యంలో కూడా ఈ నియామకం జరిగింది. గుజరాత్ కేడర్ ఐఎఎస్ అధికారియైన శర్మ స్వచ్ఛంద పదవీ విరమణ అనంతరం బిజెపిలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే ఆయణ్ని యుపిలో ఎంఎల్‌సిగా కూడా గెలిపించారు. తన కేబినెట్‌ను విస్తరిస్తారన్న ఊహాగానాల మధ్యే ఇటీవల ఆదిత్యనాథ్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతోపాటు హోంమంత్రి అమిత్‌షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో భేటీ అయ్యారన్నది తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News