Wednesday, May 8, 2024

బస్సులో 14.8 కిలోల బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

14.8 Kgs gold captured in Hyderabad

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా పంచాలింగాల వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా బస్సులో ఓ ప్రయాణికుడి వద్ద 14.8 కిలోల బంగారం దొరికింది. తెలంగాణ నుంచి కర్నూలు వెళ్తున్న బస్సు ఆపి తనిఖీ చేయగా రాజు వద్ద బంగారం దొరికినట్టు పోలీసులు వెల్లడించారు. అనంతపురం జిలా తాడిపత్రిలోని రాయలసీమ బులియన కమ్ ట్రేడ్ ప్రైవేటు లిమిటెడ్ నగల దుకాణంలో తాను పని చేస్తున్నానని వెల్లడించారు. తన యాజమాని రామకృష్ణా రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని ఓ దుకాణంలో నుంచి బంగారం తీసుకొని వస్తున్నానని పేర్కొన్నారు. ఆధారాలు సరిగ్గా లేకపోవడంతో కేసు నమోదు చేసి బంగారాన్ని సీజ్ చేశామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News