- Advertisement -
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు రెచ్చిపోయారు. బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 20 మంది మృతి చెందగా 50 మందిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మార్కెట్, ఆస్పత్రి ముందు బాంబు పేలుళ్లు జరిగాయని బిమియాన్ పోలీస్ అధికారి జబర్దస్త్ సఫీ తెలిపాడు. పేలుళ్లకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -