- Advertisement -
హైదరాబాద్: ఎన్నికల శిక్షణకు గైర్హాజరైన వారికి సోకాజ్ నోటీసులు ఇస్తామని జిహెచ్ఎంసి ఎన్నికల అధికారి లోకేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 24న శిక్షణకు గైర్హాజరైన ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు సోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. 24న శిక్షణకు హాజరుకాని ఉద్యోగులకు నేడు మరోసారి శిక్షణ ఇస్తామన్నారు. ఎన్నికల శిక్షణకు హాజరు కానివారు తమకు కేటాయించిన శిక్షణాకేంద్రంలో తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. ఎన్నికల విధులకు గైర్హాజరయ్యే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- Advertisement -