- Advertisement -
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రెండో సారి తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. గత కొన్ని రోజుల నుంచి తగ్గుముఖం పట్టినట్టే కనిపించి మళ్లీ పంజా విసురుతోంది. గత 24 గంటల్లో 44,376 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 481 మంది మృతి చెందారు. కరోనా కేసుల సంఖ్య 92.22 లక్షలకు చేరుకోగా 1.34 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 86.42 లక్షల మంది కోలుకోగా 4.44 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. మంగళవారం దేశ వ్యాప్తంగా 11.59 లక్షల మందికి కరోనా టెస్టులు చేయగా మొత్తం టెస్టుల సంఖ్య 13.48 కోట్లకు చేరుకుంది.
- Advertisement -