Monday, April 29, 2024

79 లక్షలు దాటిన కొవిడ్ టెస్టులు

- Advertisement -
- Advertisement -

152 new covid-19 cases reported in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య 79 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 79 లక్షల 15 వేల 105 మందికి టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. అంటే ప్రతి పది లక్షల్లో 2,12,657 మందికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచనున్నట్లు అధికారులు వివరించారు. ఇదిలా ఉండగా సోమవారం 36,058 టెస్టులు చేయగా మరో 152 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 29, ఆదిలాబాద్‌లో 2, భద్రాద్రి 4, జగిత్యాల 6, జనగాం 3, భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 1, కరీంనగర్ 9,ఖమ్మం 7 , ఆసిఫాబాద్ 0, మహబూబ్‌నగర్ 6, మహబూబాబాద్ 1, మంచిర్యాల 7, మెదక్ 2, మేడ్చల్ మల్కాజ్‌గిరి 11, ములుగు 4, నాగర్‌కర్నూల్ 1, నల్గొండ 7, నారాయణపేట్ 0, నిర్మల్ 2, నిజామాబాద్ 5, పెద్దపల్లి 5, సిరిసిల్లా 4, రంగారెడ్డి 11, సంగారెడ్డి 4, సిద్ధిపేట 1, సూర్యాపేట్ 4,వికారాబాద్ 4, వనపర్తి 1, వరంగల్ రూరల్ 4, వరంగల్ అర్బన్‌లో ఏడుగురికి వైరస్ సోకింది. అంతేగాక వైరస్ దాడిలో మరోకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,94,739కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,91,115కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు. మాస్కు, భౌతిక దూరం, శానిటేషన్‌తోనే వైరస్ నుంచి దూరంగా ఉండొచ్చని ఆయన అన్నారు. ముఖ్యంగా జనసమ్మర్ధ ప్రాంతాలు, మార్కెట్లలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

యాక్టివ్ కేసులు రెండు వేలు మాత్రమే….

రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు కేవలం 2022 మాత్రమే ఉన్నాయి. వీరిలో 659 మంది ఐసోలేషన్లలో చికిత్స పొందుతుండగా మిగతా వారంతా హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం వీరెవ్వరికీ సీరియస్ పరిస్థితులు లేవని డిహెచ్ పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన చికిత్సను అందించడం వలనే వైరస్ సోకిన ప్రతి వందలో 98 మంది సులువుగా కోలుకుంటున్నారని అధికారులు వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News