Saturday, May 18, 2024

రాష్ట్రంలో కొత్తగా 167 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

167 new Corona cases newly in Telangana

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 37,283 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 167 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,73,889కు పెరిగింది. తాజాగా 164 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 6,66,176 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24 గంటల్లో ఒకరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,976కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.85 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,737 యాక్టివ్ కేసులున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News