Thursday, May 9, 2024

హైదరాబాద్‌కు మరో కొత్త ప్రాజెక్టు

- Advertisement -
- Advertisement -
Another new project for Hyderabad
ఐటి ఉద్యోగుల కోసం లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ అందుబాటులోకి…
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న
హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్‌పోర్ట్ అథారిటీ
అతి తక్కువ భూసేకరణ, కాలుష్య రహితంగా ఉండేలా
సరికొత్త ప్రజా రవాణా

హైదరాబాద్: హైదరాబాద్‌కు మరో కొత్త ప్రాజెక్టు లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఎల్‌ఆర్‌టిఎస్)ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే భాగ్యనగరంలో మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటిఎస్), హైదరాబాద్ మెట్రోరైల్ (హెచ్‌ఎంఆర్)లు ఉండగా వీటికి తోడు లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్‌ను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై ప్రతిపాదనలు సిద్ధమవుతుండగా, ఈ ప్రాజెక్టును ముందుగా ఐటి కంపెనీలు ఉన్న చోట తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్

హైదరాబాద్‌లో గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట ప్రాంతాల్లో చాలా వరకు బహుళజాతి కంపెనీలు ఉన్నాయి. మరిన్ని కంపెనీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇక్కడ లక్షల మంది ఉద్యోగులు నిత్యం పని చేస్తూ ఉంటారు. భవిష్యత్‌లో వీరంతా కార్యాలయాలకు వచ్చి వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.

కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు నుంచి

అయితే అతి పెద్ద హౌజింగ్ బోర్డుల్లో ఒకటిగా ఉన్న కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు నుంచి కోకాపేట లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రాజెక్టు చేపడితే ఎలా ఉంటుందని హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్‌పోర్ట్ అథారిటీ (హెచ్‌యూఎంటిఏ)లు సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేస్తున్నాయి. హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ పట్టణ ప్రజా రవాణా వ్యవస్థపై జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. విదేశాలను తలపించేలా వేగంగా ప్రయాణం, అతి తక్కువ భూసేకరణ, కాలుష్య రహితంగా ఉండే సరికొత్త ప్రజా రవాణా వ్యవస్థను నగరంలో అందుబాటులోకి తెచ్చేలా కసరత్తు వేగంగా సాగుతోంది.

మొత్తం 24.50 కిలోమీటర్ల మేర

ప్రతిపాదనల ప్రకారం కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డు నుంచి కోకాపేట వరకు మొత్తం 24.50 కిలోమీటర్ల మేర లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. ఈ మార్గంలో కెపిహెచ్‌బీ, రాయదుర్గం మెట్రోస్టేషన్లు, హైటెక్ సిటీ ఎంఎంటిఎస్ స్టేషన్ అనుసంధానంతో పాటు నార్సింగి దగ్గర మెట్రో ఫేట్ 2 లైన్‌లను కూడా అనుసంధాలించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News