Tuesday, May 14, 2024

రాష్ట్రంలో కొత్తగా 167 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

167 new covid cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 37,941 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 167 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,71,790కి పెరిగింది. తాజాగా 207 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటివరకు 6,63,898 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24 గంటల్లో ఒక్కరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,959కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.82 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.58 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,933 యాక్టివ్ కేసులున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News