- Advertisement -
న్యూయార్క్: అమెరికాలోని నికరాగ్వాలో ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోంటినిటా ప్రాంతంలో ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 17 మంది ఘటనా స్థలంలోనే చనిపోయారు. రెస్క్యూ టీమ్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన 25 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ట్రక్కు వాస్లాలా నగరం నుంచి శాన్ ఆంటోనియా ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. మృతులలో 12 మంది మహిళలు ఉన్నారని, ట్రక్కుకు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందని వాస్లావా మేయర్ జర్మన్ వర్గోస్ తెలిపారు. గాయపడిన వారిలో 12 మంది మహిళలు, పాప ఉంది.
- Advertisement -