- Advertisement -
బెగుసరాయి (బీహార్) : బీహార్లో రెండు వేర్వేరు సంఘటనల్లో దుండగుల దాడికి ఇద్దరు మృతి చెందగా, విద్యార్థి నాయకుడు తీవ్రంగా గాయపడ్డాడు. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ బీహార్ విద్యార్థి విభాగం నాయకుడు బలాల్ రాజా సమస్తిపూర్ జిల్లా సత్మల్పూర్ గ్రామంలో తన తండ్రికి చెందిన పెట్రోలు బంకు వద్ద నిల్చుని ఉండగా గుర్తు తెలియని నలుగురు మోటారు బైకు పై వచ్చి కాల్పులు జరిపారు. రాజా కుడి భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దీనికి కారణం ఏమిటో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. మరో సంఘటనలో భరౌల్ గ్రామంలో ప్రైవేట్ రోడ్డు నిర్మాణ కంపెనీకి చెందిన ఇద్దరిని ఆగంతకులు కాల్చి చంపారు.
2 killed One Injured in Separate Incidents At Bihar
- Advertisement -