Saturday, April 27, 2024

భద్రాద్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

2 Women killed in Road Accident in Bhadradri

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం కరకగూడెం మండలంలోని రేగుళ్లలో వేగంగా దూసుకొచ్చిన ఓ బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసుల వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

2 Women killed in Road Accident in Bhadradri

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News