- Advertisement -
ముంబై : లక్నో ముంబై ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న 30 ఏళ్ల మహిళపై శుక్రవారం రాత్రి ఎనిమిది మంది దోపిడీ దొంగలు తత్తులతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు బెదిరించి 20 మంది ప్రయాణికుల నుంచి నగదు, ఆభరణాలు దోచుకున్నారు. దొంగల దాడిలో ఐదారు మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురై గట్టిగా అరవడంతో రైలును ముంబై లోని కాసరా స్టేషన్ వద్ద ఆపేశారు. అప్రమత్తమైన పోలీసులు ఆ కోచ్ వద్దకు చేరుకుని నలుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. దొంగల నుంచి రూ.34 వేల నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
- Advertisement -