Saturday, April 20, 2024

20 వేలు దాటిన కరోనా కేసులు…

- Advertisement -
- Advertisement -

20139 Corona positive cases in India

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 20,139 కరోనా కేసులు నమోదుకాగా 38 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గత వారం రోజుల వరకు రోజుకు 15 వేల నుంచి 20 వేల కేసులు నమోదుకాగా ఇప్పడు ఒక్కసారిగా 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 4,36,89,989 చేరుకోగా 5,25,557 మంది దుర్మరణం చెందారు. ఇప్పటి వరకు కరోనా 4,30,28,356 మంది కోలుకోగా 1.36 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. 199.27 కోట్ల మందికి కరోనా డోసులు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News