Saturday, April 27, 2024

ఎపిలో మరో 2,068 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -
2068 New covid-19 cases reported in ap
వచ్చేనెల 14 వరకు నైట్ కర్ఫ్యూ పొడగింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 80,641 పరీక్షలు నిర్వహించగా 2,068 కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 19,64,117కి చేరింది. ఇక కరోనాతో మరో 22 మంది ప్రాణాలను కోల్పోయారు. దీనితో మృతుల సంఖ్య 13,354కి చేరింది. అటు కొత్తగా మరో 2,127 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 49,683 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం

ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉండనుంది. ఆగస్టు 14 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News