Friday, April 26, 2024

రాష్ట్రంలో 300 దిగువకు రోజువారీ కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

230 new covid cases reported in telangana

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఆదివారం కొత్త కేసులు 300కి లోపే నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 50,636 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 230 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,59,543కి చేరింది. ఒక్కరు వైరస్ బారినపడి మరణించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,884గా నమోదైంది. అత్యధికంగా జిహెచ్‌ఎంసి పరిధిలో 72 కేసులు నమోదయ్యాయి. అదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 357 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,545 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.57 శాతంగా నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News