న్యూఢిల్లీః భారత్లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రతి రోజూ 20వేలకు పైగా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలోని ప్రస్తుత పరిస్థితులతో ప్రజలు తీవ్ర భయాదోళనలకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 24,248 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 425మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,97,413కు చేరింది. దీంతో ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదైన మూడో దేశంగా భారత్ నిలిచింది. ఇప్పటివరకు కరోనా కేసుల విషయంలో మూడో స్థానంలో ఉన్న రష్యాను భారత్ వెనక్కి నెట్టింది. ఇక, భారత్ లో కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 19,693కు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,53,287 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 4,24,433 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 99,69,662 మందికి కరోనా పరీక్షలు చేశామని ఐసిఎంఆర్ తెలిపింది. నిన్న ఒక్కరోజే 1,80,596 మందికి కరోనా పరీక్షలు చేశామని పేర్కొంది.
24248 New Corona Cases Reported in India