Saturday, April 27, 2024

దేశంలో మళ్లీ పెరుగుతున్న కేసులు..

- Advertisement -
- Advertisement -

24354 New Corona Cases Reported in India 

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంట‌ల్లో 14,29,258 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేయగా.. 24,354 క‌రోనా పాజిటివ్ కేసులు కొత్త‌గా న‌మోదయ్యాయని కేంద్ర ఆరోగ్య వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇక, కరోనాతో మరో 234మంది బాధితరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 3.38కోట్లు దాటింది. ఇప్పటివరకు దేశంలో కరోనాతో 4.48లక్షల మంది బాధితులు మరణించారు. గత 24 గంటల్లో 25,455మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3.30కోట్ల మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 2,73,889 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కేర‌ళ‌లో కొత్త‌గా 13,834 కేసులు న‌మోదు కాగా, క‌రోనాతో నిన్న ఒక్క రోజే 95 మంది మ‌ర‌ణించారు.

24354 New Corona Cases Reported in India 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News