Sunday, May 19, 2024

దేశంలో కొత్త‌గా 24,712 పాజిటీవ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తుండడంతో దేశంలో గురువారం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరిగింది.

హైద‌రాబాద్‌: కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తుండడంతో దేశంలో గురువారం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరిగింది. దేశంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 24,712 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. నిన్న‌టి(బుధవారం)క‌న్నా 3శాతం అధికంగా పాజిటివ్ కేసులు న‌మోదైనట్లు తెలిపింది. ఈ మహమ్మారి వైరస్ కారణంగా మరో 312 మంది మ‌ర‌ణించిన‌ట్లు పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 1,01,23,778కు చేరుకుంది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 1,46,756మంది కరోనా బాధితులు మ‌ర‌ణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,83,849 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 29,791 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 96,93,173 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

24712 New Corona Cases Registered in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News