- Advertisement -
హైదరాబాద్: ఆస్పత్రిలో వైద్య సిబ్బందికి 250 పిపిఇ కిట్లను పంపిణీ చేశామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జనగామ ఏరియా ఆస్పత్రిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైద్యుల సేవలను ప్రపంచం మరచిపోదని, వైద్యులు తమ ప్రాణాలను పణంగాపెట్టి పని చేస్తున్నారని ప్రశంసించారు. కరోనా నిర్మూలన అయ్యేంతవరకు పూర్తిగా లాక్డౌన్ పాటించాలని ప్రజలకు సూచించారు. గ్రీన్కో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఎండి చెలమశెట్టీ అనిల్కు అభినందనలు తెలిపారు. సామూహిక దూరం, స్వీయ నియంత్రణతో కరోనాను అరకడదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జడ్పిటిసి పాగాల సంపత్రెడ్డి, కలెక్టర్ నిఖిల, మున్సిపల్ చైరపర్సన్ పోకల జమున లింగయ్య పాల్గొన్నారు.
250 PPE kits give to doctors by errabelli dayakar
250 PPE kits give to doctors by errabelli dayakar
- Advertisement -