Saturday, May 11, 2024

2.92 లక్షలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

267 new covid -19 cases reported in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2.92 లక్షలు దాటింది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,92,395 మందికి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 55 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 8, భద్రాద్రి 8,జగిత్యాల 7, జనగాం 7, భూపాలపల్లి 7, గద్వాల 0, కామారెడ్డి 1, కరీంనగర్ 20,ఖమ్మం 8 , ఆసిఫాబాద్ 4, మహబూబ్‌నగర్ 4, మహబూబాబాద్ 2, మంచిర్యాల 10, మెదక్ 6, మేడ్చల్ మల్కాజ్‌గిరి 18, ములుగు 0, నాగర్‌కర్నూల్ 4, నల్గొండ 9, నారాయణపేట్ 0, నిర్మల్ 5, నిజామాబాద్ 4, పెద్దపల్లి 8, సిరిసిల్లా 4, రంగారెడ్డి 16, సంగారెడ్డి 9, సిద్ధిపేట్ 8, సూర్యాపేట్ 7, వికారాబాద్ 7, వనపర్తి 0, వరంగల్ రూరల్ 7, వరంగల్ అర్బన్ లో 10, యాదాద్రిలో మరో నలుగురికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,92,395కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,86,893కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు.

వైరస్ దాడిలో 1583 మంది మృతి…

రాష్ట్రంలో కరోనా వైరస్ దాడిలో ఇప్పటి వరకు 1583 మంది మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో డెత్ రేట్ 0.54 శాతంగా రికార్డు అయింది. ఇది దేశ సగటు 1.4 కంటే తక్కువగా తేలడం గమనార్హం. అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర వైరస్ అతి తక్కువగా ఉందని అధికారులు అంటున్నారు. అంతేగాక ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం వలన కోలుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. దీంతో రికవరీ రేట్ 98.11 శాతానికి పెరిగింది. అంటే ప్రతి వందలో 98 మంది సులువుగా కోలుకుంటున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది.

75.42 లక్షలు దాటిన కరోనా పరీక్షలు…

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య 75 లక్షల 42 వేల 537కు పెరిగింది. అంటే ప్రతి పది లక్షల్లో 2,02,647 మందికి టెస్టులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచుతామని వైద్యశాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా ప్రతి రోజు 44 శాతం ప్రైమరీ కాంటాక్ట్‌లకు, 12 శాతం సెకండరీ కాంటాక్ట్‌లకు టెస్టులు చేస్తున్నామని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అంతేగాక ప్రతి రోజు 97 శాతం ప్రభుత్వ సెక్టార్ కేంద్రాల్లో పరీక్షలు చేస్తుండగా, కేవలం 3 శాతం మాత్రమే ప్రైవేట్‌లో టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News